ఓం నమశ్శివాయ
శివానందలహరి శ్లోకం 10
నరత్వం దేవత్వం నగవన మృగత్వం మశకతా
పశుత్వం కీటత్వం భవతు విహగత్వాది జననమ్ |
సదా త్వత్పాదాబ్జ స్మరణ పరమానంద లహరీ
విహారాసక్తం చేత్ హృదయమిహ కిం తేన వపుషా ? || 10 ||
శ్లోకం
పదాన్వయము, అర్ధతాత్పర్యములు -
నరత్వం, దేవత్వం, నగ, వన, మృగత్వం, మశకతా, పశుత్వం, కీటత్వం, విహగత్వ, ఆది, జననమ్, భవతు, హృదయమ్, ఇహ, సదా, త్వత్, పాదాబ్జ, స్మరణ, పరమానంద, లహరీ, విహార + ఆసక్తం చేత్, తేన, వపుషా, కిం?
నరత్వం = మనుష్యునిగా కానీ
దేవత్వం = దేవతగా కానీ
నగ = పర్వతము గా
వన = అరణ్యముగా
మృగత్వం = జంతువులా కానీ
మశకతా = దోరగా కానీ
పశుత్వం = అనువుగా కానీ
కీటత్వం = పురుగుగా కానీ
జననమ్ = పుట్టుక
భవతు = కలుగు గాక
హృదయమ్ = హృదయమందు ( ఏ ప్రాణి గా పుట్టినా ఆ ప్రాణి హృదయంలో )
ఇహ = ఈ లోకంలో
సదా = ఎల్లప్పుడూ
త్వత్ = నీయొక్క, ఈశ్వరుని యొక్క
పాదాబ్జ = పాద పద్మముల యొక్క
స్మరణ = స్మరణ వలన కలిగే
పరమ + ఆనంద = ఉత్కృష్టమైన ఆనందము అనే
లహరీ = ప్రవాహము నందు
విహార = విహరించటానికి
ఆసక్తం చేత్ = ఆసక్తి కలిగినదైతే
తేన = దానిచేత( అటువంటి జన్మ వలన )
వపుషా = శరీరముతో, ఆ ఉపాధితో
కిం = ఏమి నష్టము ?
మనుష్యుడుగా గానీ, దేవుడుగా గానీ, పర్వతముగా గానీ, అడవిగా గానీ, మృగముగా గానీ, దోమగా గానీ, పశువుగా గానీ, పురుగుగా గానీ, పక్షులు మొదలగు వానిగా ఎలా పుట్టినా ఫరవాలేదు. కానీ ఎల్లప్పుడూ నా మనస్సు నీ పాదపద్మముల స్మరణలో పరమానందముగా విహరించుట యందు ఆసక్తి కలిగి ఉన్నట్లైతే, ఇంక ఏ జన్మ వచ్చినా ఏమి నష్టము ? అంటే, ఏ జన్మలభించినా నష్టము లేదని అర్ధము.
పైన చెప్పబడిన వాటిలో ఎటువంటి ఉపాధి లభించినా, నీ పాద పద్మములను స్మరించటం వల్ల కలిగే మహదానందము లభిస్తే, ఆ జన్మ ధన్యత నొందుతుంది.
మనకు ప్రారబ్ధ వశమున ఏ జన్మైనా రావచ్చును. కానీ ఆ జన్మలన్నింటిలోనూ, తన హృదయంలో ఈశ్వర పాదారవింద స్మరణము మాత్రము కలిగేటట్లుగా అనుగ్రహించమని ఈ శ్లోకంలో జగద్గురువులు శ్రీ ఆదిశంకరాచార్యులు ప్రార్ధిస్తున్నారు. ఈశ్వర అనుగ్రహము, ఈశ్వర స్మరణ ఉంటే, ఏ ఉపాధి అయితే ఏమి ? ఆ దేహానికి ఏమి లోటు ? అంటున్నారు.
జగద్గురువులు శ్రీ ఆదిశంకరాచార్యులే తమ వివేకచూడామణిలో మదటి శ్లోకంలోనే
' జంతూనాం నర జన్మ దుర్లభమ్...' అన్నారు. ఎందుకంటే, మానవ జన్మలో జ్ఞానము పొందే అవకాశాలు అనేక రకాలుగా ఉన్నాయి. మానవులకు మోక్ష సాధన సామగ్రి చాలా ఉంటుంది. మానవులు మాట్లాడ గలరు కనుక దైవ సంకీర్తన చెయ్యగలరు, భగవత్కథలను చదవగలరు, పూజ చెయ్య గలరు, దైవ మందిరాలకి, క్షేత్రాలకి, తీర్ధాలకీ వెళ్ళ గలరు, సత్సాంగత్యం చెయ్యగలరు, గురువుల నాశ్రయించి, జ్ఞానము సంపాదించి ముక్తి పొంద గలరు.
అటువంటి దుర్లభమైన మానవ జన్మ లభించినప్పుడు దానిని చరితార్ధ మొనరించు కోవాలి కదా ! కానీ ఎంత మంది తమ మానవులు తమ జీవితాన్ని సద్వినియోగ పరచుకో గలుగుతున్నారు ? కనుక ఈశ్వర భక్తి, దైవ స్పృహ లేని మానవ ఉపాధి కంటే, భగవంతుని యందు భక్తి కలిగిన ఏ శరీరము లభించినా, జీవుడు తరించ గలడు అని ఆచార్యులు చెప్తున్నారు. ఏ జన్మ ఎత్తినా, ఆ జంతువు హృదయం ఈశ్వరుని స్మరించటం వల్ల కలిగే ఆనందానుభూతిని పొంద గలిగేదిగా ఉండాలి. అయితే, మనుష్యులకు వివేకం ఉంది కనుక, మానవ ఉపాధి కనుక సహజంగానే తరించటానికి చాలా మార్గాలున్నాయి. మరి జంతువులకు, పశు పక్ష్యాదులకు, క్రిమి కీటకాలకు, చెట్లు చేమలకు, రాళ్ళకు మొదలైన వాటికి ఇన్ష్టింక్ట్ అంటారే, దాని వల్ల ఆహార నిద్రా భయాదులే ఉంటాయి. పరిసరావకి సహజంగా ప్రతి స్పందిస్తాయి. మరి వాటికి ఉత్తమ జన్మ ఎలా వస్తుంది, ముక్తి ఎలా వస్తుంది? అంటే, వాటి కర్మ ఫలం వలన పరమ భాగవతోత్తముల స్పర్శ వల్లో, వారి మాటలు వినటం వల్లో, వారి ఉచ్ఛిష్టము భుజించటం వల్లో, క్రిందటి జన్మ సంస్కారం వల్లో అటువంటి సద్గతి లభించి, వారి, వాటి హృదయాలలో కూడా ఈశ్వర భక్తి ఉంటుంది, ఉదయిస్తుంది, వర్ధిల్లుతుంది, తరింప జేస్తుంది.
గజేంద్రుడు, మకరి, బృందావనంలోని గోవులు ముక్తి పొందాయి.
భగవద్గీతలో శ్రీకృష్ణుడు ' మాం వ్యపాశ్రిత్య పాపయోనయో2పి వరాం గతించిన యాంతి' పాప యోనులైనా, నన్ను ఆశ్రయిస్తే ఉత్తమ గతులు పొందుతారు అని చెప్పాడు. ఏ ఉపాధిలో ఉన్నా ఈశ్వర స్మరణ ఒక పరమానంద లహరి. ఎడతెగని ఆ శివానంద ప్రవాహంలో ఈదులాడేవారు, మునకలేసే వారు ఆ ఆనంద స్వరూపులే అవుతారు.
పరమ శివభక్తులైన శ్రీ పుష్పదంతులవారు ఈశ్వర కటాక్షం కోసం ఎలా ప్రార్ధించారో చూడండి.
దీనో2స్మి జ్ఞాన హీనో2స్మి ప్రణతో2స్మి చ శంకర !
కురు ప్రసాదం దేవేశ అపరాధం క్షమస్వ మే !!
న హి నిర్వహణం యాంతి ప్రభూణామాశ్రితా రుషః !
ప్రసీద దేవ దేవేశ దీనస్య కృపణస్య చ !!
అపి కీట పతంగత్వం గచ్ఛేయం తవ శాసనాత్ !
భక్తో2హం సర్వదా దేవ పుత్రత్వే హి ప్రతిష్ఠత !!
శంకర ! నేను దీనుడిని, జ్ఞానహీనుడిని. సతతము నీకే నమస్కరిస్తాను, నా యందు దయ చూపించు. నా అపరాధాలను క్షమించు. నీవు ఆజ్ఞాపించినట్లైతే, కీటకముగా కానీ, పురుగుగా కానీ ఎలా పుట్టమన్నా పుడతాను. కానీ నన్ను నీ పుత్రుని వలె చూడు. సదా నీ భక్తుడినయ్యేలా అనుగ్రహించు.
'ఈశ్వరస్సర్వభూతానాం హృద్దేశే2ర్జున తిష్టతి' అని భగవానుడే భగవద్గీతలో చెప్పాడు. పిపీలికాది బ్రహ్మ పర్యంతము గల సకల ఉపాధులందు పరబ్రహ్మము - ఈశ్వరుడు కూటస్థుడుగా ఉండి, సకల ప్రపంచమును నడుపుతున్నప్పుడు సకల ప్రాణికోటికి తమ నిజ స్వరూపమును తెలుసుకుని, పరమాత్మలో లీనమవటానికి అర్హులే కదా ! కానీ, ప్రారబ్ధ వశాన లభించిన ఆ ఉపాధిలో ఉన్న జీవుడికి ఈశ్వర స్మరణ కలిగే సుకృతం ఉండాలి. ఈశ్వర స్పృహ లేనప్పుడు అత్యంత దుర్లభమైన మానవ ఉపాధి లభించినా వ్యర్ధమే ! ఈశ్వర స్మరణ ఉన్నప్పుడు సాలుపురుగులా పుట్టినా, పాములా పుట్టినా, ఏనుగులా పుట్టినా, ఉడతలా పుట్టినా, భల్లూకములా పుట్టినా, జటాయువు వంటి పక్షిలా పుట్టినా, జింకలా జన్మించినా, ఈశ్వరానుగ్రహంతో ముక్తి పొందారు కదా !
ఏ వేదంబు పఠించెలూత? భుజగంబే శాస్త్రముల్ సూచె, తా
నే విద్యాభ్యసన మొనర్చె కరి? చెంచే మంత్ర మూహించె? బో
ధావిర్భావ నిదానముల్ చదువులయ్యా? కావు నీ పాద సం
సేవాసక్తియె కాక, జంతు తతికిన్ శ్రీకాళహస్తీశ్వరా !!
జీవులకు ముక్తి కలగటానికి నీ పాదాలు సేవించే భక్తి ఉంటే చాలు. ఈశ్వర భక్తులు ముక్తి పొందటానికి వారి జన్మలు అడ్డు రావు.
ఎన్ని కావ్యాలు పఠించినా, ఎన్ని చదువులు చదివినా, ఎన్ని శాస్త్రాలను ఔపోసన పట్టినా, నిర్మలమైన, నిశ్చలమైన, నిష్కపటమైన భక్తి లేకపోతే ముక్తి లేదు, రాదు.
రాయినైనా కాకపోతిని రామ పాదము సోకగా ... అంటూభక్తితో పరవశించి పాడతారు భక్తులు. పరమాత్మ పాదం తగిలితే చాలు దేనిదైనా సరే, జన్మ ధన్యమౌతుంది. వేల సంవత్సరాల క్రితమే అయినా, పరమాత్మ శ్రీకృష్ణునిగా పుట్టి, తిరిగిన బృందావనంలోని మట్టి కణములు ఈశ్వరుని శరీరమునుంచి జారి పడే విభూతి కణములంత పవిత్రములనీ, తాము బృందావనంలో మట్టిలా పుట్టాలని కోరుకుంటారు కృష్ణ భక్తులు. గోపికలు, మహర్షులు కూడా బృందావనంలో వృక్షాలలా పుట్టి, ఈ రోజుకీ శ్రీకృష్ణ లీలలను అనుభవిస్తూ ఆనందిస్తున్నారు.
🙏🙏🙏🌹
డా.విశాలాక్షి
శివానందలహరి శ్లోకం 10
నరత్వం దేవత్వం నగవన మృగత్వం మశకతా
పశుత్వం కీటత్వం భవతు విహగత్వాది జననమ్ |
సదా త్వత్పాదాబ్జ స్మరణ పరమానంద లహరీ
విహారాసక్తం చేత్ హృదయమిహ కిం తేన వపుషా ? || 10 ||
శ్లోకం
పదాన్వయము, అర్ధతాత్పర్యములు -
నరత్వం, దేవత్వం, నగ, వన, మృగత్వం, మశకతా, పశుత్వం, కీటత్వం, విహగత్వ, ఆది, జననమ్, భవతు, హృదయమ్, ఇహ, సదా, త్వత్, పాదాబ్జ, స్మరణ, పరమానంద, లహరీ, విహార + ఆసక్తం చేత్, తేన, వపుషా, కిం?
నరత్వం = మనుష్యునిగా కానీ
దేవత్వం = దేవతగా కానీ
నగ = పర్వతము గా
వన = అరణ్యముగా
మృగత్వం = జంతువులా కానీ
మశకతా = దోరగా కానీ
పశుత్వం = అనువుగా కానీ
కీటత్వం = పురుగుగా కానీ
జననమ్ = పుట్టుక
భవతు = కలుగు గాక
హృదయమ్ = హృదయమందు ( ఏ ప్రాణి గా పుట్టినా ఆ ప్రాణి హృదయంలో )
ఇహ = ఈ లోకంలో
సదా = ఎల్లప్పుడూ
త్వత్ = నీయొక్క, ఈశ్వరుని యొక్క
పాదాబ్జ = పాద పద్మముల యొక్క
స్మరణ = స్మరణ వలన కలిగే
పరమ + ఆనంద = ఉత్కృష్టమైన ఆనందము అనే
లహరీ = ప్రవాహము నందు
విహార = విహరించటానికి
ఆసక్తం చేత్ = ఆసక్తి కలిగినదైతే
తేన = దానిచేత( అటువంటి జన్మ వలన )
వపుషా = శరీరముతో, ఆ ఉపాధితో
కిం = ఏమి నష్టము ?
మనుష్యుడుగా గానీ, దేవుడుగా గానీ, పర్వతముగా గానీ, అడవిగా గానీ, మృగముగా గానీ, దోమగా గానీ, పశువుగా గానీ, పురుగుగా గానీ, పక్షులు మొదలగు వానిగా ఎలా పుట్టినా ఫరవాలేదు. కానీ ఎల్లప్పుడూ నా మనస్సు నీ పాదపద్మముల స్మరణలో పరమానందముగా విహరించుట యందు ఆసక్తి కలిగి ఉన్నట్లైతే, ఇంక ఏ జన్మ వచ్చినా ఏమి నష్టము ? అంటే, ఏ జన్మలభించినా నష్టము లేదని అర్ధము.
పైన చెప్పబడిన వాటిలో ఎటువంటి ఉపాధి లభించినా, నీ పాద పద్మములను స్మరించటం వల్ల కలిగే మహదానందము లభిస్తే, ఆ జన్మ ధన్యత నొందుతుంది.
మనకు ప్రారబ్ధ వశమున ఏ జన్మైనా రావచ్చును. కానీ ఆ జన్మలన్నింటిలోనూ, తన హృదయంలో ఈశ్వర పాదారవింద స్మరణము మాత్రము కలిగేటట్లుగా అనుగ్రహించమని ఈ శ్లోకంలో జగద్గురువులు శ్రీ ఆదిశంకరాచార్యులు ప్రార్ధిస్తున్నారు. ఈశ్వర అనుగ్రహము, ఈశ్వర స్మరణ ఉంటే, ఏ ఉపాధి అయితే ఏమి ? ఆ దేహానికి ఏమి లోటు ? అంటున్నారు.
జగద్గురువులు శ్రీ ఆదిశంకరాచార్యులే తమ వివేకచూడామణిలో మదటి శ్లోకంలోనే
' జంతూనాం నర జన్మ దుర్లభమ్...' అన్నారు. ఎందుకంటే, మానవ జన్మలో జ్ఞానము పొందే అవకాశాలు అనేక రకాలుగా ఉన్నాయి. మానవులకు మోక్ష సాధన సామగ్రి చాలా ఉంటుంది. మానవులు మాట్లాడ గలరు కనుక దైవ సంకీర్తన చెయ్యగలరు, భగవత్కథలను చదవగలరు, పూజ చెయ్య గలరు, దైవ మందిరాలకి, క్షేత్రాలకి, తీర్ధాలకీ వెళ్ళ గలరు, సత్సాంగత్యం చెయ్యగలరు, గురువుల నాశ్రయించి, జ్ఞానము సంపాదించి ముక్తి పొంద గలరు.
అటువంటి దుర్లభమైన మానవ జన్మ లభించినప్పుడు దానిని చరితార్ధ మొనరించు కోవాలి కదా ! కానీ ఎంత మంది తమ మానవులు తమ జీవితాన్ని సద్వినియోగ పరచుకో గలుగుతున్నారు ? కనుక ఈశ్వర భక్తి, దైవ స్పృహ లేని మానవ ఉపాధి కంటే, భగవంతుని యందు భక్తి కలిగిన ఏ శరీరము లభించినా, జీవుడు తరించ గలడు అని ఆచార్యులు చెప్తున్నారు. ఏ జన్మ ఎత్తినా, ఆ జంతువు హృదయం ఈశ్వరుని స్మరించటం వల్ల కలిగే ఆనందానుభూతిని పొంద గలిగేదిగా ఉండాలి. అయితే, మనుష్యులకు వివేకం ఉంది కనుక, మానవ ఉపాధి కనుక సహజంగానే తరించటానికి చాలా మార్గాలున్నాయి. మరి జంతువులకు, పశు పక్ష్యాదులకు, క్రిమి కీటకాలకు, చెట్లు చేమలకు, రాళ్ళకు మొదలైన వాటికి ఇన్ష్టింక్ట్ అంటారే, దాని వల్ల ఆహార నిద్రా భయాదులే ఉంటాయి. పరిసరావకి సహజంగా ప్రతి స్పందిస్తాయి. మరి వాటికి ఉత్తమ జన్మ ఎలా వస్తుంది, ముక్తి ఎలా వస్తుంది? అంటే, వాటి కర్మ ఫలం వలన పరమ భాగవతోత్తముల స్పర్శ వల్లో, వారి మాటలు వినటం వల్లో, వారి ఉచ్ఛిష్టము భుజించటం వల్లో, క్రిందటి జన్మ సంస్కారం వల్లో అటువంటి సద్గతి లభించి, వారి, వాటి హృదయాలలో కూడా ఈశ్వర భక్తి ఉంటుంది, ఉదయిస్తుంది, వర్ధిల్లుతుంది, తరింప జేస్తుంది.
గజేంద్రుడు, మకరి, బృందావనంలోని గోవులు ముక్తి పొందాయి.
భగవద్గీతలో శ్రీకృష్ణుడు ' మాం వ్యపాశ్రిత్య పాపయోనయో2పి వరాం గతించిన యాంతి' పాప యోనులైనా, నన్ను ఆశ్రయిస్తే ఉత్తమ గతులు పొందుతారు అని చెప్పాడు. ఏ ఉపాధిలో ఉన్నా ఈశ్వర స్మరణ ఒక పరమానంద లహరి. ఎడతెగని ఆ శివానంద ప్రవాహంలో ఈదులాడేవారు, మునకలేసే వారు ఆ ఆనంద స్వరూపులే అవుతారు.
పరమ శివభక్తులైన శ్రీ పుష్పదంతులవారు ఈశ్వర కటాక్షం కోసం ఎలా ప్రార్ధించారో చూడండి.
దీనో2స్మి జ్ఞాన హీనో2స్మి ప్రణతో2స్మి చ శంకర !
కురు ప్రసాదం దేవేశ అపరాధం క్షమస్వ మే !!
న హి నిర్వహణం యాంతి ప్రభూణామాశ్రితా రుషః !
ప్రసీద దేవ దేవేశ దీనస్య కృపణస్య చ !!
అపి కీట పతంగత్వం గచ్ఛేయం తవ శాసనాత్ !
భక్తో2హం సర్వదా దేవ పుత్రత్వే హి ప్రతిష్ఠత !!
శంకర ! నేను దీనుడిని, జ్ఞానహీనుడిని. సతతము నీకే నమస్కరిస్తాను, నా యందు దయ చూపించు. నా అపరాధాలను క్షమించు. నీవు ఆజ్ఞాపించినట్లైతే, కీటకముగా కానీ, పురుగుగా కానీ ఎలా పుట్టమన్నా పుడతాను. కానీ నన్ను నీ పుత్రుని వలె చూడు. సదా నీ భక్తుడినయ్యేలా అనుగ్రహించు.
'ఈశ్వరస్సర్వభూతానాం హృద్దేశే2ర్జున తిష్టతి' అని భగవానుడే భగవద్గీతలో చెప్పాడు. పిపీలికాది బ్రహ్మ పర్యంతము గల సకల ఉపాధులందు పరబ్రహ్మము - ఈశ్వరుడు కూటస్థుడుగా ఉండి, సకల ప్రపంచమును నడుపుతున్నప్పుడు సకల ప్రాణికోటికి తమ నిజ స్వరూపమును తెలుసుకుని, పరమాత్మలో లీనమవటానికి అర్హులే కదా ! కానీ, ప్రారబ్ధ వశాన లభించిన ఆ ఉపాధిలో ఉన్న జీవుడికి ఈశ్వర స్మరణ కలిగే సుకృతం ఉండాలి. ఈశ్వర స్పృహ లేనప్పుడు అత్యంత దుర్లభమైన మానవ ఉపాధి లభించినా వ్యర్ధమే ! ఈశ్వర స్మరణ ఉన్నప్పుడు సాలుపురుగులా పుట్టినా, పాములా పుట్టినా, ఏనుగులా పుట్టినా, ఉడతలా పుట్టినా, భల్లూకములా పుట్టినా, జటాయువు వంటి పక్షిలా పుట్టినా, జింకలా జన్మించినా, ఈశ్వరానుగ్రహంతో ముక్తి పొందారు కదా !
ఏ వేదంబు పఠించెలూత? భుజగంబే శాస్త్రముల్ సూచె, తా
నే విద్యాభ్యసన మొనర్చె కరి? చెంచే మంత్ర మూహించె? బో
ధావిర్భావ నిదానముల్ చదువులయ్యా? కావు నీ పాద సం
సేవాసక్తియె కాక, జంతు తతికిన్ శ్రీకాళహస్తీశ్వరా !!
జీవులకు ముక్తి కలగటానికి నీ పాదాలు సేవించే భక్తి ఉంటే చాలు. ఈశ్వర భక్తులు ముక్తి పొందటానికి వారి జన్మలు అడ్డు రావు.
ఎన్ని కావ్యాలు పఠించినా, ఎన్ని చదువులు చదివినా, ఎన్ని శాస్త్రాలను ఔపోసన పట్టినా, నిర్మలమైన, నిశ్చలమైన, నిష్కపటమైన భక్తి లేకపోతే ముక్తి లేదు, రాదు.
రాయినైనా కాకపోతిని రామ పాదము సోకగా ... అంటూభక్తితో పరవశించి పాడతారు భక్తులు. పరమాత్మ పాదం తగిలితే చాలు దేనిదైనా సరే, జన్మ ధన్యమౌతుంది. వేల సంవత్సరాల క్రితమే అయినా, పరమాత్మ శ్రీకృష్ణునిగా పుట్టి, తిరిగిన బృందావనంలోని మట్టి కణములు ఈశ్వరుని శరీరమునుంచి జారి పడే విభూతి కణములంత పవిత్రములనీ, తాము బృందావనంలో మట్టిలా పుట్టాలని కోరుకుంటారు కృష్ణ భక్తులు. గోపికలు, మహర్షులు కూడా బృందావనంలో వృక్షాలలా పుట్టి, ఈ రోజుకీ శ్రీకృష్ణ లీలలను అనుభవిస్తూ ఆనందిస్తున్నారు.
🙏🙏🙏🌹
డా.విశాలాక్షి
No comments:
Post a Comment